TDP Chandrababu Naidu 2nd Day Kuppam tour Vizagvision #Vizagvision #TDPChandrababu VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
TDP Chandrababu Naidu 2nd Day Kuppam tour Vizagvision
-
Previous
Vizagvision : విశాఖపట్నం, అక్టోబరు 30: వెనుకబడిన కులాల వారికి మెరుగైన జీవితాలను అందించడానికి వారు సమాజంలో ధైర్యంగా ఉండేందుకు రాష్ట్ర బిసి కమిషన్ పని చేస్తున్నదని, రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ అంబటి శంకరనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బి.సి కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో అధిక సంఖ్య లో వెనుకబడిన కులాల వారు ఉన్నారని, శుక్రవారం ఉడా చిల్డ్రన్ ఎరినాలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణ, అభ్యంతరాల సేకరణలో భాగంగా సుమారు 70 కులాల మంది వారి సమస్యలను కమిషన్ కు విన్నవించుకున్నారని, వారి అర్జీలను పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నామన్నారు. కార్యాలయాలలో ఉద్యోగ నియామకాలలో అర్హులైన వారికి రోష్టర్ పాయింట్ ఆధారంగా బిసి రిజర్వేషన్ల ను అమలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎక్కువ సంఖ్య లో కులదృవీకరణ పత్రాలను సక్రమంగా ఇవ్వడం లేదన్న అర్జీలు వచ్చాయన్నారు. అర్హులైన బిసి యువతకు రిజర్వేషన్ల ను వర్తింపచేయాలని, నకిలి దృవపత్రాలు తీసుకొనే వారి పట్లా అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు చేపట్టాలన్నారు. ఉదయం వేపగుంట గంగిరెడ్ల కాలనీలో పర్యటించడం జరిగిందని చాలా దుర్బర పరిస్ధితిలో కుటుంబాలు ఉన్నాయని అవకాశం మేరకు వారికి ఉపాధి సౌకర్యం కల్పించాలన్నారు.
కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ బి.సి.ల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి కమిటి జిల్లాకు రావడం జరిగిందని అన్నారు. వెనుకబడిన కులాల వారు అభివృద్ది చెందాలంటే అక్షరాస్యత శాతాన్ని పెంచుకోవాలని వారు పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు – నేడు పథకం కింద కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి అన్ని విద్యా సంస్థలలో పలు సంస్కరణలను చేపట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 139 బిసి కులాలు ఉన్నాయని వారికి కులదృవీకరణ పత్రాలను ఇచ్చేటప్పుడు పూర్తిగా పరిశీలించి మంజూరు చేయాలన్నారు.
కమిషన్ సభ్యులు మారక్కగారి కృష్ణప్ప మాట్లాడుతూ ఉద్యోగ నియమకాలు మరియు ప్రమోషన్లలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో రోస్టర్ పాయింట్ ఆదారంగా నియామాకాలు చేపట్టాలన్నారు.
కమిషన్ సభ్యులు వెంకట సత్యదివాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమానికై పలు అభివృద్ది పధకాలను అమలు చేస్తున్నాదన్నారు. ముఖ్యంగా విద్యా విదానంలో వినూత్నమైన మార్పులను తీసుకొచ్చి కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చి దిద్దుతున్నారన్నారు. వసతి గృహాలు సరియైన వసతులు లేక దీన పరిస్ధితిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ వీటిపై దృష్టి పెట్టాలన్నారు. విశాఖ జిల్లాలో ఉండే రెడ్డిక కులాల వారికి బి.సి సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. అదే విదంగా వడ్ర కులస్థులకు విశ్వ బ్రహ్మణ కులంలో ఇస్తున్నారని, ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సూచించారు. సింహాస్థలం దేవస్థానంలో దేవుడికి సమర్పించిన ఆవులను కబేళకు అమ్ముతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయాన్ని ఆలయ ఇఓ దృష్టికి తీసుకు వెళ్లటం జరిగిందన్నారు. దేవస్థానం పరిధిలో ఆవులు , దూడలు అదృశ్యమైతే గంగిరెడ్ల కులాల వారిపై కేసులు పెట్టి వేదిస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని ఈ విషయంలో తగు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కు సూచించారు.
జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారికి కుల దృవీకరణ పత్రాలు సచివాలయాల ద్వారా ధరఖాస్తు పెట్టిన 21 రోజుల టైమ్ పిరియడ్ లో మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. మండల అధికారులతో వీడియో కాన్పరెన్స్ పెట్టి ఆదేశాలను ఇస్తామని తెలిపారు. నకిలీ సర్టిఫికేట్లు పొందే వారిపై తగు చర్యలు చేపడుతున్నామన్నారు. కమిషన్ ఇచ్చిన ఆదేశాలను తప్పని సరిగా పాటిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో కమిషన్ కార్యదర్శి డి.చంద్రశేఖర్ రాజు, బిసి వెల్పేర్ డిడి రాజేశ్వరి, జిల్లా బి.సి సంక్షేమ శాఖ అధికారి శ్రీదేవి, ఇతర జిల్లా అధికారులు హాజరైయ్యారు.
బి.సి కమిషన్ నగరంలో పర్యట న లో భాగంగా పిషింగ్ హార్బర్ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డడు పిషింగ్ బోటు ఆపరేటర్సు తో సమావేశమై వారి సమస్యలను తెలుసుకొని వినతులను స్వీకరించారు. ప్రస్తుతం ఇస్తున్న ఆయిల్ సబ్సిడి సరిపోవడం లేదని, ఇంకా సబ్పిడి పెంచాల్సిందిగా కోరారు. మత్స్యకారులు బి.సి ఎ కేటగిరిలో ఉన్నారని, చాలా వెనుకబడి ఉన్నామని కాబట్టి ఎస్ టి కేటగిరిలో చేర్చాల్సిందిగా కోరారు. కమిషన్ కొత్త జాలారి పేటలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కమిషన్ తరుపున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు.