Steroids ఎవరికి వాడాలి? | అతిగా వాడేవాళ్లకు | ఎదురయ్యే కాంప్లికేషన్స్ | Dr.Srinivas K Silas | Vizagvision #Vizagvision #Steroidsఎవరికివాడాలి? VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
Steroids ఎవరికి వాడాలి? | అతిగా వాడేవాళ్లకు | ఎదురయ్యే కాంప్లికేషన్స్ | Dr.Srinivas K Silas
-
Previous
నృసింహ వనంలో మొక్కలు నాటిన సింహాచలం దేవస్థానం అర్చకులు , వేద పండితులుప్రపంచ పర్యావరణ దినోత్సవంనాడు అంటే ఈ నెల 5వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమాన్ని సింహాచలం దేవస్థానం ఛైర్ పర్సన్ సంచయిత గజపతి, ఈఓ సూర్యకళ, ట్రస్టు బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రారంభించారు. ఈ డ్రైవ్ ఒక్కరోజుకో, ఒక్క ప్రాతానికో, ఒక వర్గానికో పరిమితం కాకుండా… సింహాచలం దేవస్థానం ఉద్యోగులు గోశాల ఎక్స్ టెన్షన్ సెంటర్ లో వివిధ రకాల మొక్కల్ని ఇవాళ నాటారు. దేవస్థానం వైదిక వర్గాలు, వేద పండితులు, అర్చకులు ఉత్సాహంగా మొక్కల్ని నాటారు. మొత్తం కార్యక్రమాన్ని గోశాల AEO రమణమూర్తి, గోశాల ఇన్ ఛార్జ్ హరి పర్యవేక్షించారు. ఉద్యోగులందరితోనూ మొక్కల్ని నాటిస్తామని… అందరూ ఉత్సాహంగా ముందుకొస్తున్నారని AEO రమణమూర్తి, హరి తెలిపారు. ఈ క్లీన్ అండ్ గ్రీన్ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి, ఈఓ, ట్రస్టుబోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంనాడు చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తితో ఉద్యోగులంతా ముందుకెళ్లాలని ఈఓ సూచించారు. ధర్మకర్త ఇప్పటికే తనకిష్టమైన ఆంధ్రా రకం పండూరి మామిడి పండు మొక్కను నాటానని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇవాళ మొక్కహలు నాటినవారిలో స్థానాచార్యులు డాక్టర్ రాజగోపాల్, ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యులు, హవల్దార్ గోపాల్, అలంకారి సీతారామాచార్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరు మొక్కను నాటి… దాన్ని పరిరక్షిస్తే… కరోనా లాంటి వ్యాధులు భవిష్యత్ లో రావని అర్చకులు చెప్పారు. ప్రకృతిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం ప్రతిఒక్కరి విధని పిలుపునిచ్చారు Simachalam,Visakhapatnam, Vizagvision…..