రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడం అన్యాయం టాక్సులు భారం ప్రజలు పై పడకుండా చూడలిBJP Ex MLA Vishnu Kumaraju Vizagvision రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడం అన్యాయం , వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి 152 సీట్లు తో ముఖ్యమంత్రి గా చేసిన ప్రజలు పట్ల వై సీ పీ ప్రభుత్వం అనేక రకాలుగా వేదిపులు గురిచేస్తోంది అని విశాఖ జిల్లా బీ జె పీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీ జీ పీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లో పని చేస్తున్న అధికారులు కు, పదవి లో రాజకీయ నాయకులు కు ఎటువంటి పన్ను చెల్లింపులు ఉండవు కాబట్టే ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వీరికి అర్ధంకావటం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆయన ముఖ్య కార్యదర్శి లు , అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నట్లు ఉన్నారు అని విమర్శించారు. మెజార్టీ సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలు లేకుండ నియంత ధోరణిలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ప్రజలు కట్టిన వివిధ రకాల పన్నులు తో నాయకులు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అన్నారు. ఇప్పటకైన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపు పై పునరాలోచించాలి , టాక్సులు భారం ప్రజలు పై పడకుండా చూడలి అని బీ జె పీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమారాజు సూచించారు #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/