ముఖ్యమంత్రి వర్యులుకి వృత్తి కళాకారులు విన్నపం || తెలుగుసాంఘిక-పౌరాణిక శాస్త్రీయ-జానపద-గిరిజన నృత్య కళాకారులును పట్టించుకోండి || Vizagvision ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుకి ఆంధ్రప్రదేశ్ వృత్తి కళాకారుల నమస్కరిస్తు విన్నపములు … గత రెండు సంవత్సరాలనుంచి రాష్ట్ర సాంస్కృ తిక రంగం చతికిలబడింది. డప్పుదరువులేదు. కాలిమువ్వలు ఘళ్ళుమనలే దు. స్వరాలు పలికే గళాలు విలపిస్తున్నాయి. మృదంగ నాదం వినిపించ లేదు. తబలా తలవంచుకుని మూలబడింది. నవరసాలన్నీ దుఃఖరసంలో కలిసిపోయాయి. అందుక్కార ణం కరోనా…కరోనా -కరోనా… మన13 జిల్లాల్లో సంగీత-సాహి త్య-సాంఘిక-పౌరాణిక రంగస్థ ల…శాస్త్రీయ-జానపద-గిరిజన నృత్య…వివిధ వాద్య కళకారు లు…మిమిక్రీ-మ్యాజిక్ కళాకా రులు…ఆర్కెస్ట్రాలు, గాయనీ గాయకులు ఇలా వివిధ కళల 25వేల మంది వృత్తి కళాకారు లుగా జీవిస్తున్నారు. వీరిలో వెయ్యిమంది మాత్రమే వృద్ధ కళాకారుల పింఛను పొందుతు న్నారు. ఈ కరోనా కష్ట కాలంలో వృత్తి కళాకారులు ప్రోగ్రాములు లేక, డాన్స్, సంగీత క్లాస్ చెప్పుకోలేక,రంగ స్థల కళాకారులు ప్రదర్శనలు లేక రోడ్డునపడి బతుకుతున్నా రు. మాకు రాష్ట్ర ప్రభుత్వంను ంచి ఎటువంటి సహాయ సహ కారాలు అందలేదని చెప్పడాని కి చింతిస్తున్నాం-సిగ్గుపడుతు న్నాం. గానీ…పలు ప్రైవేటు సం స్థలు, విద్యా సంస్థలు మమ్మల్ని ఎంతో కొంత ఆదుకున్నారని గర్వంగా చెబుతున్నాం. వారికి ధన్యవాదాలుకూడా సమర్పిస్తు న్నాం. ఇక అసలు విషయానికొ స్తే! గతంలో కళాకారులు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల బిల్లులు చెల్లించమని కోరుతూ తమరని కలవడంకూడా జరిగినది.మీరు వెంటనే స్పందించి సంబంధిత అధికారుల్ని పిలిచి బిల్లులు చెల్లించాలని ఆదేశాలివ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు పదిశాతంమాత్రమే చెల్లించారు. ఈ సందర్భంగా మీకో విషయా న్ని గుర్తు చేయదలచుకున్నాం. ఈ సందర్భంగా ఒక కళాకారిణి హృదయ విదారకమైన గతిని మీ ముందుంచుతున్నాం. ఈ కరోనా సమయంలో గడవడం కష్టమై ప్రతిష్టాకరమైన రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కార గ్రహీ త అయిన ఒక కళాకారిణి…త న అభిమానులిచ్చిన-వచ్చిన శాలువాలన్నింటినీ ఒక్కొక్కటి గా అమ్ముకుని కాలంగడిపారు అంటే కళాకారులెంత దయనీ యమైన స్థితిలో ఉన్నారో ఆలో చించమని విన్నవించుకుంటు న్నాం. కళలకు-కళాకారులకు ఉత్తరాంధ్ర జిల్లాలు పెట్టింది పేరు. కళలకు నిలయమైన అటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల కు చెప్పుకోడానికి మాకు…ఒక టూరిజం-కల్చరల్ మంత్రివర్యు లు, మరియు ఆంధ్రప్రదేశ్ కల్చ రల్ కమిటీ చైర్పర్సన్, రాజ్య సభ సభ్యులుకూడా ఉన్నారు. వారికెన్నో పర్యాయాలు మా బాధల్ని వినిపించుకోవడం జరి గింది. ముఖ్యమంత్రిగారితో మాట్లాడి చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాతే మిమ్మలను కలవడంకూడా జరిగినది. అ య్యా ఈ సందర్భంలో మేం కోరుకునేది కొన్ని విషయములు 01)ఈ కరోనా కష్టకాలంలో ప్రతి వృత్తి కళాకారులకు ఐదు వేల రూపాయలు కరోనా భృతి ఇవ్వాలి. 02)ఉచితంగా వైద్య సేవలు అందించాలి 03)బస్సులో ఉచిత బస్ పాసులు కల్పించాలి 04)కళాకారుల యొక్క పిల్లల కు కులమతాలకతీతంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించాలి. 05)కళాకారుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల రేషన్ ఇప్పించ వలసిందిగా కోరుతున్నాము. 06) ముఖ్యంగా కళాకారులకు గూడు కల్పించండి #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/