అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్ఐ ఊరికి దూరంగా పొలాల్లో గుర్తు తెలియన మృత దేహం ఉందని అక్కడికి చేరుకున్నారు కాశీబుగ్గ ఎస్సై శిరీష. కుళ్లిపోయి, గుర్తు తెలియకుండా ఉన్న ఆ శవాన్ని మోసేందుకు, కనీసం చూసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఆమె ఆ శవాన్ని మోసుకుంటూ వాహనం వరకు తీసుకెళ్లారు.గుర్తుపట్టలేని విధంగా ఉన్న దాదాపు 70 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం అది. స్థానికులను విచారించాను. ఎవరికీ తెలియదని చెప్పారు. శరీరం బాగా కుళ్లిపోయింది. అక్కడ ఉండానికి కూడా ఎవరు ఇష్టపడలేదు. ఆ శరీరాన్ని మోసుకుని పొలం గట్లు దాటించి…జీపు వరకు తీసుకుని రావడానికి ఎవరైనా సాయం చేస్తారెమోనని అడిగాను. ఎవరు రాలేదు. మాతో వచ్చిన కానిస్టేబుల్స్ కూడా మళ్లీ స్నానం చేయాలి కదా మేడం అంటూ ఇబ్బంది పడ్డారు. దాంతో ఇక నేను నాకు తెలిసిన లలితా ఛారిటబుల్ ట్రస్ట్ పర్సన్ కి ఫోన్ చేసి స్ట్రెచర్ తీసుకుని రమ్మన్నాను. ఆయన సహాయంతో ఆ మృతదేహాన్ని స్ట్రెచర్ పై మోసుకుంటూ అరకిలోమీటరు పైగా పొలం గట్లపై నడుచుకుంటూ జీపు వద్దకు చేరుకున్నాం. అక్కడ లలితా ఛారిటబుల్ ట్రస్ట్ వారికి ఆ మృతదేహాన్ని అప్పగించి…అంత్యక్రియల కోసం కొంత ఆర్థిక సాయం చేశాను” కాశీబుగ్గ ఎస్సై శిరీష.శిరీషా చర్యల ను అభినంధించిన పోలీసు అధికారులు… #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/