జిల్లాలో అధిక సంఖ్య లో వోటర్లను నమోదు గావించడములో విశేష కృషి చేసినందుకు జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నరు విశ్వ భూషన్ హరిచందన్ చేతుల మీదుగా సోమవారం రాజభవన్ దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు.
తన నాయకత్వ ప్రతిభతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలుచేసి ఓటర్ల జాబితాలో సవరణలకు సంబంధించిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించడం, జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించినందుకు ఈ అవార్డును అందుకున్నారు