విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర హోమం ప్రతి నెలలో ఒక రోజు జరిగే స్వామి నామ నక్షత్రమైన స్వాతి నక్షత్రం హోమానికి భక్తులు పూజలు చేసుకున్నారు సుమారు పది జంటలు పాల్గొన్నారు ఈ పూజలో పాల్గొన్న భక్తులు 2500 రూపాయలు చెల్లించి పాల్గొనాల్సి ఉంటుంది కరోనా వైరస్ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు పూజలు నిర్వహిస్తున్నారు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతితో హోమాన్ని ముగించారు స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి అనంతరం కళ్యాణ మండపంలో స్వామివారిని పల్లకిలో అధిష్టింప చేసి స్వాతి నక్షత్ర హోమం నిర్వహించారు నేడు సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందన దీక్షల విరమణ చేశారు భక్తులు కోవిడ్ నిబంధన కారణంగా భక్తులను స్వామివారి తొలి పంచ వద్ద మాల విసర్జన చేసి అనంతరం స్వామి దర్శనం చేసుకున్నారు ప్రతి ఏడాది దేవస్థానం వైభవంగా ఈ దీక్షలు నిర్వహించేది కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది అధికారకంగా ఈ దీక్షలు దేవస్థానం చేపట్టలేదు VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/