Fiber Show 2020 Vizag Grandly Innagurated at Novotel in Visakhapatnam,Vizagvision…
ఫైబర్ షో 2020 వైజాగ్ ప్రారంభం…అధునాతన మిశ్రమాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన, నిర్మాణాత్వంతో
సృష్టించబడిన అత్యంత సమర్థవంతమైన ఫైబర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ “ ఫైబర్ షో 2020 వైజాగ్” శనివారం ఉదయం నోవాటెల్ హోటల్లో ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, ఉత్తరాంధ్ర జిల్లాల కరోనా నియంత్రణ నోడల్ ఆఫీసర్ డాక్టర్ పి. వి. సుధాకర్
రిబ్బన్ కట్ చేసి ఫైబర్ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైబర్ ఉత్పత్తి సంస్థ,బల్లరీ షిప్పింగ్ ఎంటర్ప్రైజెస్ (పి) లిమిటెడ్
మేనేజింగ్ డైరెక్టర్ బాలరపు సతీష్ ప్రసాద్, డైరెక్టర్ ప్రియదర్శని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వి. సుధాకర్ మాట్లాడుతూ ఫైబర్ మిశ్రమాలతో అత్యాధునిక ఫైబర్ ఉత్పత్తులు తయారుచేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు.మూన్ లాండింగ్ సాటెలైట్స్ , కమ్యూనికేషన్ వీథర్ క్యాట్ స్కాన్స్,మైక్రో ప్రాసెసర్లు, లేజర్స్, అధునాతన కాంపోజిట్ మెటీరియల్స్,
జంబో జెట్స్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్స్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్రొడక్ట్స్ కాంపోజిట్స్ ఆధునాతన ఫైబర్ ఉత్పత్తులు తయారు చేయడం
20 వ శతాబ్దపు మొదటి పది సాంకేతిక విజయాలుగా చెప్పవచ్చన్నారు.బల్లరీ షిప్పింగ్ ఎంటర్ప్రైజెస్ (పి) మేనేజింగ్ డైరెక్టర్
బి సతీష్ ప్రసాద్ మాట్లాడుతూ
ఫైబర్ గ్లాస్ 1940 ల చివరలో అభివృద్ధి చెందిందని తెలిపారు. మొదటి ఆధునిక మిశ్రమం ఉత్పత్తి చేయబడిన అన్ని మిశ్రమాలలో ఇది 80% చేస్తుందన్నారు. బోట్ హల్స్, సుర్ ఇయర్డ్స్, స్పోర్టింగ్ గూడ్స్, బిల్డింగ్ ప్యానెల్స్, ఎయిర్క్రాఫ్ట్ బాడీస్, కార్ బాడీస్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ మొదలైన వాటికి ఈ ఫైబర్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారని తెలిపారు.