తుఫాను,వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి ఉదారంగా సాయం అందేలా చూడండి:సిఎస్.
సచివాలయంలో వరద నష్టాలపై పొటో ఎగ్జిబిషన్ ను తిలకించిన సౌరవ్ రాయ్ నేతృంత్వంలోని 7గురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృదం.తదుపరి సిఎస్ సహా వివిధ శాఖల అధికారులతో సమావేశం.ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వివిధ శాఖల వారీ జరిగిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు.
రైతుల నుండి తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం FAQ(Fair Average Quality)నిబంధనలను సడలించేలా సిఫార్సు చేయాలి
అలాగే దెబ్బతిన్న వేరుశెనగ పంటకు కూడా FAQ(Fair Average Quality) నిబంధనలను సడలించేలా సిఫార్సు చేయాలని సిఎస్ కేంద్ర బృందానికి విజ్ణప్తి చేశారు.
• 6వేల 386కోట్ల రూ.లు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి వెల్లడించిన సిఎస్
• తాత్కాలిక పున:రుద్దరణ సహాయ చర్యలకు 840 కోట్లు అవసరం
• శాశ్వత పున:రుద్ధణర చర్యలకు 4వేల 439కోట్ల రూ.లు అవసరం
• ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్థి,ప్రాణ నష్టాలను చాలా వరకు తగ్గించాం
• ఇన్ పుట్ సబ్సిడీని వెంటనే అదించి రైతులకు కొంతమేర ఉపశమనం కలిగించాం
• వ్యవసాయానికి సంబంధించి 2లక్షల 12వేల హెక్టార్లు దెబ్బతిని 903 కోట్లు నష్టం
• ఉద్యానవన పంటలు 24వేల 515 హెక్టార్లు దెబ్బతిని 483 కోట్లు నష్టం
• ఆర్ అండ్ బి కి సంబంధించి 5వేల 583 కి.మీ రోడ్లు దెబ్బతిని 2వేల 976కోట్లు నష్టం
• పంచాయితీరాజ్ 3వేల 125 కి.మీలు దెబ్బతిని 781కోట్లు నష్టం
• నీటిపారుదలకు 1074కోట్లు నష్టం
• మున్సిపాలిటీలకు 75కోట్లు నష్టం