Visakhapatnam Port 87th Foundation Day Services Provided Export-Import Year 2019-20 Chairman Press Meet Vizag Vision..2019-20 సంవత్సరానికి గాను విశాఖపట్నం పోర్ట్ అందించిన సేవలను,ఎగుమతి దిగుమతి వివరాలను తెలిపేందుకు పోర్ట్ ఛైర్మన్ కె.రామమోహన్ రావు పోర్ట్ కళావాణిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భoగా ఆయన మాట్లాడుతూ ముందుగా విశాఖ నగరంపై ఆయనకున్న అభిమానాన్ని,ఇష్టాన్ని తెలియచేసారు.2019-20 ఆర్ధిక సంవత్సరంలో పోర్ట్ ట్రస్ట్ 72.72 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డ్ సృష్టించిందని అన్నారు.పోర్ట్ ఉద్యోగులు,ఎగుమతి దిగుమతిదారుల సమిష్టి కృషి ఫలితంగానే కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కూడా రికార్డ్ సాదించగలిగామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.అందుచేతనే గత ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ యేడాది 11శాతం అధికంగా రవాణా జరిగినట్టు తెలిపారు.2020-21 ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధభాగంలో కూడా మంచి వృద్ది సాదించామని,ఇప్పటివరకు 32.77 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేశామని తెలిపారు.గత యేడాది అర్ధభాగంతో పోల్చుకుంటే ఈ యేడాది 1.98 మిలియన్ టన్నుల సరుకు తక్కువగా రవాణా అయిందని అన్నారు.రవాణా అయ్యే బొగ్గు,ఐరన్,ఐరన్ ఓర్,ఆయిల్,ఫెటిలేజర్స్,కంటైనర్స్,కార్గోల శాతాన్ని ఆయన వివరించారు.
అలాగే నగరాభివృద్దిలో పోర్ట్ ట్రస్ట్ తన వంతు భాద్యత నిర్వర్తిస్తూ వస్తుందని ఛైర్మన్ కె.రామ్మోహన్ రావు అన్నారు.కాలుష్యాన్ని నియత్రించడంలో ముందుంటున్నామని,అందుకు తగినట్టు ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.ఇక కోవిడ్ బారిన పడకుండా పోర్ట్ సిబ్బందికి ప్రత్యేక కిట్లు,సానిటైజర్స్ వంటి ఏర్పాటు చేశామని,ఒక కోవిడ్ సెంటర్ ని కూడా ప్రారంభించామని తెలిపారు.ట్రాఫిక్ సమస్య పరిష్కారంకోసం పోర్ట్ చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనుల వివరాలు వెల్లడించారు.