ఆగ్నేయ బంగాళాఖాతంలో 29న అల్పపీడనం ఏర్పడి, బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది Vizagvision…
దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడి, బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎండ తీవ్రత, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది.
ఈ ప్రభావంతో శనివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
కాగా, శుక్రవారం రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి
















