ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు.
షెవోపూర్: మధ్యప్రదేశ్లోని షెవోపూర్ జిల్లా ఆసుపత్రిలో శనివారం ఉదయం అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ఒక మహిళ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇదే మొదటిసారి. సిక్ న్యూబార్న్స్ కేర్ యూనిట్లో నవజాత శిశువులను అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే, ఆరుగురు నవజాత శిశువుల్లో ఇద్దరు పుట్టీపుట్టగానే కన్నుమూశారు. తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.