అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువ చదరంగ క్రీడాకారిణి బోడ్డా ప్రత్యూష తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ప్రత్యూష గ్రాండ్ మాస్టర్ టైటిల్ అందుకని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకువచ్చినందుకు అభినందించారు. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.