ఈ నెల 18న ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల కలయికకు ముఖ్యఅతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ చెప్పట్టబోతున్న,పూర్తయిన పలు ప్రాజెక్టులకు గాను సిఎం చేతులమీదుగా సంకుస్థాపనలు,ప్రారంబొత్సవాలు చేయించబోతున్నట్టు జివిఎంసి కమిషనర్ సృజన తెలియచేసారు.అందుకు సంభందించిన వివరాలను వెల్లడించేందుకు ఈ రోజు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.సుమారు 9వందల కోట్ల రూపాలయాల విలువగల ప్రాజెక్టులకు సిఎం శంకుస్థాపన చేయన్నున్నారని తెలిపారు.2వందల కోట్లతో రోడ్లు,మెగా పార్క్స్,స్విమ్మింగ్ పూల్స్,70కిలోమీటర్ల మేర డ్రైన్స్,APDRP నుండి విడుదలైన 109కోట్లతో గ్రీనరీ అభివృద్ది,కోతకు గురైన తీరప్రాంతాల్లో పటిష్ట చర్యలు,ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి 60కోట్ల రూపాయలతో జివిఎంసి పాఠశాలల అభివృద్ది,ఏషియన్ డెవెలప్మెంట్ బ్యాంక్ నుండి 9.50కోట్లతో ముడసర్లోవ అభివృద్దితో పాటుగా ఇప్పటికే 90శాతం పనులు పూర్తి చేసుకున్న అమృత్ ఫేస్ వన్ ప్రారంబొత్సవం,స్మార్ట్ సిటీ నిధులనుండి 70కోట్ల రూపాయలతో దూరప్రాంతాలకు మంచినీటి పైప్ లైన్ల ఏర్పాటు,రెండు ఇండోర్ స్టేడియంలకు శంకుస్థాపన,ఉప్పాడ డంపింగ్ యార్డులో 25ఎకరాల్లో బయోమైనింగ్ ఇలా మరికొన్ని ప్రాజెక్టులకు సిఎం శంకుస్థాపన చేయనున్నట్టు ఆమె వివరించారు