బంతిపూల రైతులకు గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు Paderu Agency in Visakhapatnam…
విశాఖ పాడేరు మన్యంలో బంతిపూల రైతులకు గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు పెట్టుబడి రాకపోగా కష్టం కూడా మెదక్ లేదని ఆవేదన పడుతున్నారు.
ఏజెన్సీ మనీ కేంద్రం పాడేరులో సెప్టెంబర్ నెల నుంచి బంతిపూల విక్రయాలు జోరు అందుకుంటాయి. పాడేరు హుకుంపేట జి.మాడుగుల ఈ సీజన్లో బంతిపూలు అధికంగా వస్తుంటాయి రైతులు కాయకష్టం చేసి పూలు పాడేరు రైతు బజారు కు తరలిస్తారు
మైదాన ప్రాంతాల్లో దిగుబడులు బట్టి ఏజెన్సీలో అమ్మకాలు నిర్ణయం అవుతాయి బయటి మార్కెట్లో డిమాండ్ ఉన్నట్లయితే ధర ఎక్కువ పెట్టుకుంటారు వ్యాపారులు కూడా పాడేరు రాలేనట్లయితే దళారులు రేటు కుదించి కొనుగోలు చేస్తుంటారు. అయితే నిలకడలేని ధరలతో రైతులు బెంబేలెత్తుతున్నారు వ్యవసాయ సంబంధమైన రేట్లు నిర్ణయించేవారు లేకపోవడంతో తాము నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు మన్యంలో అధికంగా ఇటీవల 300 వరకు గంప ధర పలికింది ప్రస్తుతం 20 -30 మధ్య ధర పలకడంతో గిరి రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు కొండ మార్గాల గుండా కిలోమీటర్ల మేర బంతిపూలు వచ్చినప్పటికీ గంప ధర 20 రావడంతో కూలీ డబ్బులు కూడా రావట్లేదని ఆందోళన చెందుతున్నారు.
బంతిపూలు రైతులు, పాడేరు
ధరను నిర్ణయించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధికారులు చర్యలు చేపట్టి గిట్టుబాటు ధర వచ్చేలా ప్రయత్నం చేసి తమను ఆదుకోవాలని బంతిపూల రైతులు కోరుతున్నారు