తప్పుడు ఆధారాలతో జిల్లా కోర్టును మోసం చేస్తున్న పెద్ద ముఠా పోలీసులకు చిక్కింది ఇన్ విశాఖపట్నం,Vizagvision…విశాఖ నగరంలో తప్పుడు ఆధారాలతో జిల్లా కోర్టును మోసం చేస్తున్న పెద్ద ముఠా పోలీసులకు చిక్కింది. అనేక కేసులలో తప్పుడు ఆధారాలు ప్రవేశపెట్టి దోషం తప్పించిన ముఠా గుట్టు ఎట్టకేలకు వీడింది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీస్ కమిషనర్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ముద్దాయిలు గుర్రాల కోటేశ్వరరావు, అంగటి సూర్యనారాయణ, మారోజు జగదీశ్వర రావు, ఆలపాటి వెంకటేశ్వరరావు మరికొంతమంది అనుచరులతో కలిసి నకిలీ ధ్రువ పత్రాలు, నకిలీ స్టాంపులు మరియు నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి, వాటి ద్వారా తప్పుడు జామీను దారులుగా గౌరవ రెండవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి మరియు ఇతర కోర్టు ల నందు ప్రవేశపెట్టి, వారి నిజమైన జామిని దారులుగా నమ్మించి కోర్టు వారిని మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు dcp రంగా రెడ్డి ఆధ్వర్యంలో మహారాణి పేట పోలీసులు ఏ వన్ నిందితుడు అయినటువంటి గుర్రాల కోటేశ్వరరావు నివాసం మహారాణి పేట లో దాడి చేసి ప్రధాన ముద్దాయి తో పాటు ఇతర ముద్దాయిలను పట్టుకున్నట్లు కమిషనర్ మీనా తెలిపారు. మొత్తం 13 మంది నిందితులను పట్టుకోగా వారి వద్ద నుండి 129 ఫేక్ స్టాంపులు, 21 ఒరిజినల్ ఆధార్ కార్డులు, నకిలీ ఇంటి పన్ను రసీదు లు, నకిలీ జామీను పత్రాలు, ఇంకా 2045 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.