Arrest Gang of Robbers by Visakha Police Vizagvision…చెడు వ్యసనాలకు బానిసై, పగటి పూట నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ను పోలీసులు పట్టుకున్నారు.ఇటీవల కాలంలో వరుసగా విశాఖ నగరంలో చోటు చేసుకున్న దొంగతనాల నేపథ్యంలో పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఏ డి సి పి క్రైమ్ సురేష్ బాబు, ఏసీపీ పెంటా రావు నిందితుల కోసం ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. వీరికి ఐదుగురు నిందితులు తో కూడిన గ్యాంగ్ పట్టుబడినట్లు పోలీసు కమిషనర్ మీనా తెలిపారు. అదేవిధంగా నిందితుల వద్ద నుంచి 18 1/2 తులాల బంగారం, సుమారు 35 తులాల వెండి వస్తువులు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొరికిన నిందితుల్లో నలుగురు విశాఖ నగరానికి చెందిన వారు కాగా ఒకరు వరంగల్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.