29 నుంచి అన్నప్రసాద వితరణ
మండల కాల మహా అన్నప్రసాద వితరణ మహోత్సవాన్ని ఈనెల 29 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు అయ్యప్ప స్వామి భక్తుల కోసం నలభై ఒక్క రోజుల పాటు కార్యక్రమాన్ని రైల్వే న్యూ కాలనీ లోని దొండపర్తి దరి వైర్లెస్ కాలనీ వద్ద గల కోదండరామ దేవాలయ ప్రాంగణంలో శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు కె. శ్రీను, అధ్యక్షుడు పి. రమణ మూర్తి లు పేర్కొన్నారు. ఆదివారం ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించిన భక్తుల కోసం ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ చేతన్ కుమార్ శ్రీవాత్సవ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు సహాయం అందించాలన్నారు. అయ్యప్ప దీక్ష చేపట్టిన వారoదరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలయ, ట్రస్టు ప్రతినిధులు జి.శ్రీనివాసరావు, రవి, మన్మధ, కె. అప్పారావు, కోటేశ్వరరావు, అవతారం, లక్ష్మీనారాయణ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.