భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు,గాంధీనగర్,Vizagvision…
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రపతి.. ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ గారిని గాంధీనగర్లోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆమెతో కాసేపు మాట్లాడిన రాష్ట్రపతి ఆమె బాగోగులు తెలుసుకున్నారు.
ప్రధాని తల్లిని చూస్తే తన తల్లిని చూసినట్లే ఉందని రాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నట్లు సమాచారం.
ఆమెతో మాట్లాడినంత సేపు తాను చాలా సంతోషానికి గురైనట్లు ఆయన తెలిపారు.
ఈ వయసులోనూ ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందనీ, ఇలాంటి వారు మనందరికీ ఆదర్శప్రాయులని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.