శరన్నవరాత్రుల్లో మూడో రోజైన మంగళవారం (ఆశ్వయుజ శుద్ధ తదియ) ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు సాక్షాత్కరిస్తుంది
వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి … ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది
పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగి బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం
మంగళవారం వంగ, ఆకుపచ్చ, బంగారు వన్నెల చీరల్లో కొలువుదీరిన అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు