ATM Centers Cheating Interstate Criminals Arrested 3persons In Ibrahimpatnam, Krishna Dist,Vizagvision…కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం లో ఏ.టీ.ఎం. కేంద్రాలవద్ద మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర నేరస్తుల అరెస్టు. నిందితుల వద్ద నుండి 5లక్షల రూపాయల స్వాదీనం చేసుకున్న పోలీసులు. మొత్తం 20 చోట్ల చోరీలకు పాల్పడి సుమారు 7 లక్షల రూపాయలు చోరీ చేయగా వారివద్ద నుండి 5 లక్షల రూపాయల రికవరీ చేసినట్లు సి.ఐ.కె.శ్రీధర్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.ఈకార్యక్రమంలో క్రైం ఎస్.ఐ.శ్రీనివాస్, తన సిబ్బంది కానిష్టేబుల్ రాధాకృష్ణ, అవినాష్. సత్యనారాయణ,శ్రీనివాసరావు సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు…