“Mahashivratri” Devotees Rush Kothipalli temple inEast Godavari Dt,Vizagvision.. K. గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కోటిపల్లి దేవాలయంలో మహాశివరాత్రి సోమవారం కావడంతో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి, అమ్మవారుని తెల్లవారుజాము నుండే దర్శించుకుంటున్న. భక్తులు. తెల్లవారుజామున 2 గంటల నుండి పరమ పవిత్రమైన గౌతమీ నదిలో స్నానం ఆచరించి పుణ్య ఫలాలు పొందుతున్న భక్తులు. రాజ రాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్టించి తమ పాపాలను పోగొట్టుకున్నాడని శ్రీదేవి భూదేవి సమేతుడైన సిద్ది జనార్ధన స్వామి వారిని ప్రతిష్టించాడని ఆయనే క్షేత్రపాలకుడు అని చెబుతారు. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి ఒడ్డున ఉంది ఈ క్షేత్రం లో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం పిలుస్తారు.

















