విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో మావోయిస్టుల వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు మరియు ఏపీఎస్పి సిబ్బంది,..
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఆపరేషన్ సమాధాన్ వారోత్సవాలు ఘనంగా ప్రారంబించారు. ఏవోబీ కటాఫ్ ఏరియాలో భారీ ఎత్తున స్థూపం నిర్మించి అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవల ఎదురు కాల్పుల్లో మ`తిచెందిన మావోయిస్టు మొదటి మహిళా నాయకురాలు మీనా స్మారకంగా ఈ స్థూపాన్ని మావోయిస్టులు నిర్మించారు. నిరసన వారోత్సవాల సదర్భంగా మావోయిస్టులు పా్రరంబించదలచిన మీనా స్మారకస్థూపం ఆవిష్కరణకు ఏవోబీలో కటాఫ్ ఏరియాలోని పలు గ్రామాలకు ఎదిన గిరిజనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టు నేతలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు చేస్తున్న అన్యాయాలపై వారికి వివరించారు. ఆమాయక గిరిజనులకు ఆసరా అయిన అటవీ సంపదను దోచుకుంటున్న వారిని అడ్డుకుందాం. ఖనిజ సంపదను కాపాడుకుందాం అని విప్లవగీతాలు ద్వరా గిరిజనులకు ప్రజామేళాలో తెలియజేశారు. ఈ సందర్భంగా గిరిజనులుతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టు నిరసన వారోత్సవాలు సందర్భంగా బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఏవోబీలో కటాఫ్ ఏరియాలోలో వారం రోజులు పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో అవన్నీ తాళాలుతో దర్శనమిచ్చాయి. అలాగే వారపుసంతల్లో కూడా పలచగా కనిపిస్తున్నారు. మావోయిస్టు నిరసన వారోత్సవాలు సందర్భంగా పోలీసులు అప్రమత్తమూ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా బయటకు వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని బ్లాక్డేగా పాటించాలని మావోయిస్టులు హెచ్చరించడంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణపనులను నిలిపివేశారు.