ఢిల్లీలో ఇండియా టుడే అవార్డు అందుకున్న మంత్రి అఖిల ప్రియ – ఈ ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదే… – గత మూడేళ్ళుగా తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు – దేశ,విదేశాల పర్యాటకులకు స్వర్గధామంగా ఏపీ – మంత్రి అఖిల ప్రియ ఢిల్లీ: పర్యాటక రంగంలో ఏపీ హవా కొనసాగుతోంది. పర్యాటకంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు లభించిం�
పర్యాటకాభివృద్ధిలో ఏపీ ఫస్ట్…
– ఢిల్లీలో ఇండియా టుడే అవార్డు అందుకున్న మంత్రి అఖిల ప్రియ
– ఈ ఘనత ఏపీ సీఎం చంద్రబాబుదే…
– గత మూడేళ్ళుగా తీసుకున్న చర్యలతో సత్ఫలితాలు
– దేశ,విదేశాల పర్యాటకులకు స్వర్గధామంగా ఏపీ – మంత్రి అఖిల ప్రియ
ఢిల్లీ: పర్యాటక రంగంలో ఏపీ హవా కొనసాగుతోంది. పర్యాటకంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు లభించింది. ఢిల్లీలో గురవారం ఇండియా టుడే నిర్వహించిన కాన్ క్లేవ్ లో ఏపీ టూరిజం దేశంలోనే బెస్ట్ అని కితాబిస్తూ, పర్యాటక రంగంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అవార్డును అందించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అందుకున్నారు. వెంకయ్యనాయుడు ద్వారా ఈ అవార్డు అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఈ ఘనత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే చెందుతుందన్నారు. గత మూడు నాలుగేళ్ళగా పర్యాటక అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఫలితాలిస్తున్నాయని, ముందు ముందు దేశ, విదేశీ పర్యాటకులకు ఏపీ స్వర్గధామం అవుతుందన్నారు. ఇప్పటికే తాము నవ్యాంధ్రలో అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహిస్తూ, పర్యాటకులను ఆకర్షిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు.