భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు.
షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సు నిమిత్తం చైనాలో పర్యటిస్తున్న మోదీ ఈరోజు కింగ్డావో చేరుకున్న విషయం తెలిసిందే.
పర్యటనలో భాగంగా ఆయన జిన్పింగ్తో భేటీ అయ్యారు.
ఇరు దేశాధ్యక్షులు వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు.
ఐదు వారాల వ్యవధిలో జిన్పింగ్ను మోదీ కలుసుకోవడం ఇది రెండో సారి ఏప్రిల్ నెలలో వుహాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ చర్చలు జరిపారు.
[6:24:43 PM]