Nava Nirmana Deeksha Pledge by AP CM at Vijayawada Vizagvision..ఒంటెద్దు పోకడలతో ఆనాడు రాష్ట్రాన్ని విభజించారని.. తొలి ఏడాదిని రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్తో ప్రారంభించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.*
విజయవాడ బెంజ్ సర్కిల్లో నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు.
ఈ సందర్భంగా డీవీ మ్యానర్ నుంచి చంద్రబాబునాయుడు ర్యాలీగా బెంజ్సర్కిల్కు కాలినడకన చేరుకున్నారు.
ప్రజలతో ‘ప్రతిజ్ఞ బూనుదాం, ప్రగతి సాదిద్ధాం’ నినాదంలో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
అన్ని రాష్ట్రాలు అవతరణ దినోత్సవాలను జరుపుకొంటున్నాయని.. మనకు ఏమి ఇచ్చారని దినోత్సవాలను జరుపుకోవాలని సీఎం ప్రశ్నించారు.
రాష్ట్రంలో సంక్షోభాలను అవకాశాలుగా మలచుకొని ముందుకెళ్తున్నామని అన్నారు.
విభజన నష్టాన్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ముందుకొచ్చామని పేర్కొన్నారు.
దేశంలోనే ఏపీని నెం.1 రాష్ట్రంగా తయరు చేసే శక్తి, సామర్థ్యం తెలుగువారికి ఉందని వెల్లడించారు.
అభద్రతా భావంలో ఉన్న ప్రజలకు విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
తొలిసారిగా గోదావరి-కృష్ణా నదుల అనుంసంధానం చేశామని సీఎం గుర్తుచేశారు.
పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు జూన్లోనే నీళ్లు ఇచ్చామని చెప్పారు.
5 నదులను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు.
రాయలసీమకు నీళ్లు ఇచ్చి భద్రత కల్పించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.
దిల్లీ కంటే సుందర రాజధాని నిర్మించుకోవచ్చని స్వయంగా ప్రధాని చెప్పారని గుర్తుచేశారు.
ఆనాడు ఇచ్చిన హామీని మరచిపోయి గుజరాత్లో దోలేరో నగరాన్ని నిర్మిస్తున్నారని.. నష్టపోయింది గుజరాత్ కాదు.. ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోవాలని కోరారు.
తెలుగుజాతికి రాజధాని నిర్మించాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు.
అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రధాని కూడా భాగమవుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్పై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని చంద్రబాబు విమర్శించారు.
అడుగడుగునా అవమానం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.
లాభాలు లేని దిల్లీ-ముంబయి బుల్లెట్ రైలుకు నిధులు ఎలా ఇస్తారు? అని సీఎం ప్రశ్నించారు.
ఇక్కడ మెట్రో రైలు అడిగితే గిట్టుబాటు కాదంటున్నారని మండిపడ్డారు.
విశాఖ రైల్వే జోన్పై కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.