ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ కైట్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు…ఆ వేడుకకు హాజరైన ఆయన ఆ దేశాధ్యక్షుడు జోకో విడోడోతో కలిసి గాలిపటం ఎగరవేశారు.
అంతకముందు రెండు దేశాల మధ్య 15 ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, శాస్త్ర, సాంకేతిక, సహకార, రైల్వే, ఆరోగ్య రంగాల్లో ఆ ఒప్పందాలు జరిగాయి.
ఉగ్రవాదంపై పోరులో ఇండోనేషియాకు తోడుగా భారత్ నిలుస్తుందని మోదీ అన్నారు.
ఇటీవల ఇండోనేషియాలో జరిగిన ఉగ్రదాడులను ఆయన ఖండించారు.
ఇండియా-ఆసియాన్ భాగస్వామ్యం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి ఏర్పడుతుందన్నారు.
ప్రెసిడెంట్ విడోడో మారిటైమ్ ఫల్క్మ్ పాలసీ.. ఇండియా చేపడుతున్న యాక్ట్ ఈస్ట్ పాలసీతో సమానమని అన్నారు