Southwest Monsoon Hits Kerala,Vizagvision..తొలకరి పలకరింపు…..
అండమాన్ చేరుకున్న రుతుపవనాలు….
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
వాయు‘గండా’ల్లేకుంటే త్వరగా తెలంగాణకు….
కేరళ, తమిళనాడుకు రుతుపవనాలు
రైతులకు తీపి కబురు…..సకాలంలోనే నైరుతి రుతు పవనాలు పలకరించే సూచనలు కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడుల్లోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని అండమాన్ నికోబార్ దీవులను పూర్తిగా ఆవరించిన నైరుతీ రుతు పవనాలు మాల్దీవుల్లోని మరిన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తున్నాయని. 24 గంటల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకూ వ్యాపించే అవకాశం ఉందిని వాతావరణ శాఖ కూల్ కబురు చెప్పింది. ఇదే అనుకూల వాతావరణం కొనసాగితే సకాంలోనే తెలంగాణకు రుతుపనాలు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గతేడాది మే 30 కల్లా నైరుతీ రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించినా తర్వాత అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావంతో పురోగతికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి 12 రోజులు పట్టింది. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాకుంటే సకాలంలోనే నైరుతీ రుతు పవనాలు తెలంగాణకు వ్యాపించే అవకాశం ఉంది.