CBSE Releases 10th Results |సీబీఎస్ఈ పది ఫలితాలు విడుదల,..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 2017-18 విద్యాసంవత్సరానికి గానూ పదో తరగతి పలితాలు మంగళవారం విడుదలయ్యాయి. తొలుత సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించినా. మధ్యాహ్నమే ఫలితాలను వెల్లడించారు. cbse.nic.in, cbseresults.nic.in వెబ్సైట్లతో పాటు ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా కూడా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 16లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాశారు.
కాగా. మార్చిలో నిర్వహించిన ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి గణిత ప్రశ్నాపత్రం పరీక్ష ముందుగానే లీకైంది. 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్ కూడా లీక్ అవడంతో ఆ పరీక్షను మళ్లీ ఏప్రిల్ 25న నిర్వహించారు. అయితే పదో తరగతి గణిత పరీక్షను మాత్రం తిరిగి నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది.
కాగా. ప్రశ్నాపత్రం లీకేజీపై రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ప్రశ్నాపత్రం ఏయే విద్యార్థులకు తెలిసింది.. ఎవరి ద్వారా తెలిసింది అన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. మరోవైపు ప్రశ్నాపత్రాన్ని ముందుగానే తెలుసుకున్న విద్యార్థుల జాబితాను దిల్లీ పోలీసులు సీబీఎస్ఈ బోర్డుకు అందజేశారు