జేడీఎస్కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్.. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామికి సీఎం పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే జేడీఎస్ అధినేతతో కాంగ్రెస్ అగ్రనేతలు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్కు 20 మంత్రి పదవులు, జేడీఎస్కు 14 మంత్రి పదవులు లెక్కన ఒప్పందం కుదిరింది. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను కలిసి.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరనున్నట్టు సమాచారం.
ఫలితాల్లో బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 76 స్థానాల్లో, జేడీఎస్ 40 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు రెండు స్థానాలు దక్కించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు సాధించాల్సి ఉంది. మేజిక్ ఫిగర్కు బీజేపీ 8 స్థానాల దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి 116 స్థానల్లో గెలుపొందాయి.