YSRCP MP Vijay Sai Reddy Padayatra in Visakhapatnam,Vizag Vision..జగన్ చేపట్టిన ప్రజాసంక్ప యాత్ర రెండు వేల కిలోమేటర్లు పూర్తిచేసుకున్న సంధర్భంగా సంఫీుభావంగా ఈ నెల 16న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. జగన్ పాదయాత్రకు సంఫీుభావంగా విశాఖ దక్షిణ నియోజకవర్గము పరిధిలో రెండవ విడత పాదయాత్రను మంగళవారం ఆరంభించారు. నియోజవర్గ పరిధిలోని సెయింట్ ఆంథోని పాఠశాల కూడలిలో గల జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యు వైఫల్యాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానికంగా ఉన్న సమస్యలను తేలుసుకొని వాటిని జగన్ దృష్టికి తీసుకెళ్లి తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాటి పరిష్కారానికి కృషిచేయడమే సంఫీుభావ యాత్ర ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో మత్య్సకార సామాజికి వర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నారన్నారు. మత్స్యకారుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ వర్గానికి చెందిన నాయకులు జనవరిలో విశాఖకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మెమోరాండం ఇచ్చేందుకు వెళ్లినప్పుడు ఆయన ఆడిన మాటలు మత్స్యకారుల పట్ల చంద్రబాబుకు గల వైఖరికి నిదర్శనమన్నారు. మత్స్యకారుల ను ఏస్టీ లో చరుస్స్తానని, టీడీపీ ప్రభుత్వంలో ధర్నాు చేస్తారా అంటూ దుర్భాషలాడి వారిని అవమానించారన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చారన్నారు. వాటిలో భాగంగా కొత్తరోడ్డులో ఉన్న డంపింగ్ యార్డును తొగించి, ఆ ప్రదేశంలో పేదల కు ఇళ్లు కట్టించి ఇస్తామని హామి ఇచ్చారన్నారు. వేట నిషేధిత సమయంలో రెండు నెల పాటు మత్స్యకారులకు నెల కి ఒక్కో కుటుంబానికి 30 కేజీల బియ్యం ఇవ్వాలని, అదేవిధంగా నెల సరి నాలుగు వేల రూపాయల భృతి ఇవ్వాల్సి ఉండగా వాటిని సంక్రమంగా అములు చేయడం లేదని ఆరోపించారు. అదేవిధంగా ప్రతి నెల 75 రూపాయల చొప్పున పది నెల పాటు పొదుపు చేసుకుంటే, దానికి సమాన మొత్తాన్ని ప్రభుత్వం భృతిని అందించాల్సిన నిబంధన ఉన్నా దానిని అములు చేయట్లేదన్నారు. మత్స్యకారుల కు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకొచ్చి నియోజక వర్గ పరిధిలో పురాతన భవనాలు ను ఆధునీకరిస్తానని స్థానిక శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్కుమార్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకుండా స్థానిక ఎమ్మెల్యే గణేష్కుమార్ కళ్ళ బోల్లి కబుర్లు చెపుతున్నారన్నారు. జిల్లాలోని మంత్రుల తో ఎమ్మెల్యే గణేష్కుమార్ కుమ్మక్కై భూకబ్జాల కు ప్పాడుతూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ, నియోజకవర్గ అభివృధ్ధిని విస్మరించారని ఆరోపించారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువు సహకారంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ను జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
సంఫీుభావ యాత్ర సాగిందిలా…
జగన్ చేస్తున్న ప్రజాసంక్ప యాత్ర రెండు వే కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చేపట్టిన రెండవ విడత సంఫీుభావ యాత్ర మంగళవారం దక్షిణ నియోజకవర్గ పరధిలోని సెయింట్ ఆంథోని పాఠశాల కూడలి వద్ద నుంచి ప్రారంభమైంది. కూడలిలో గల జ్యోతిరాపు ఫూలే విగ్రహానికి పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పూమాలలు వేసి, నివాళులు అర్పించి సంఫీుభావ యాత్రను ప్రారంభించారు.
అక్కడ నుంచి సెయింట్ ఆంథోని నగర్, దండుబజార్, కలెక్టర్ ఆఫీసు, రెల్లివీధి, ఏవీఎన్ కళాశాల , కనకమహాలక్ష్మి ఆలయం రోడ్డు, కురుపాం మార్కెట్ మీదుగా సాగి వన్టౌన్ చేరుకొని అక్కడ రాణి విగ్రహం వద్ద మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం అక్కడ నుంచి తిరిగి ప్రారంభమై కొత్తవీధి, చిలకపేట, దుర్గాలమ్మ ఆలయం, కళ్ళు పాకలు, పోలీసు బేరక్స్, సరస్వతి పార్కు, కృష్ణాగార్డెన్స్, ప్రేమసమాజం, , నీలమ్మవేపచెట్టు, వెంకటేశ్వరమెట్ట, గీత్ సంగీత్ థియేటర్ మీదుగా సాగి మనోరమ థియేటర్ వద్ద కోలా గురువులు కార్యాయం వద్ద రాత్రి బస . ఈ కార్యక్రమంలో పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు , పార్టీ నగర అధ్యక్షులు మళ్ళా విజయ్ప్రసాద్, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు తైనాల విజయ్కుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, నాగిరెడ్డి,సత్తి రామకృష్ణా రేడ్డి , ఉషాకిరన్, పార్టీ నాయకులు రవిరెడ్డి, పక్కి దివాకర్, బర్ఖత్ఆలీ , వాసు గౌడ , పోలిరెడ్డి, జాన్వెస్లీ, కొండా రాజీవ్గాంధీ,పీతల మూర్తి యాదవ్, రామన్నపాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.