Papikondalu Tourist Boat 80 Tourists Catches Fire in Veeravarapulanka | East Godavari Dist,Vizag Vision..పశ్చిమగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణీకులను సహాయక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. పాపికొండలను తిలకించేందుకు వెళ్తున్న ప్రయాణీకులను పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాపికొండలను చూసేందుకు వెళ్తున్న పడవలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
అయితే అప్రమత్తమైన పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణీకులను కాపాడారు. పోశమ్మ గుడి వద్ద నుండి బయలుదేరిన పది నిమిషాలు కాగానే దేవీపట్నం మండలం వీరవరపులంక వద్దకు చేరుకోగానే పడవలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.