శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రం లో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవములు Visakhapatnam Vizagvision విశాఖ జిల్లా అనకాపల్లి జివిఎంసి పరిధి సిరసపల్లి లో శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రం లో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చింతామణి గణపతి మూల విరాట్టుకు క్షీరాభిషేకం, పంచామృతలతో అభిషేకాలు, కుంకుమ పూజలు పత్రికలతో పూజలు చేశారు అలాగే చింతామణి గణపతి మూలవిరాట్ను 108 వెండి పువ్వులతో అలంకరించారు. అనంతరం దేవాలయ సన్నిధిలో గణపతి హోమాలు పెద్ద ఎత్తున జరిగాయి.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అవధూత దత్త పీఠాధిపతి జగద్గురువు గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహంతో చింతామణి గణపతి దత్త క్షేత్రం గణపతి పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని గణపతి నవరాత్రులలో 21 పత్రిలతో పాటు పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు ప్రతిరోజు గణపతి హోమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు . అలాగే భక్తులు సౌకర్యర్ధం ఆన్లైన్లో దర్శనాలు ఏర్పాట్లు కూడా నిర్వయించామని తెలిపారు. నవరాత్రుల్లో చింతామణి గణపతి ని దర్శించుకున్న వారికి వారు చింతలను స్వామివారి తొలగిస్తారు అని భక్తులు నమ్మకం అని తెలిపారు అదేవిధంగా 19వ తేదీ ఆదివారం అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం జరుగునని తెలియజేశారు అలాగే విశేష కార్యక్రమాలతో స్వామివారి సేవలు అందుబాటులో ఉంటాయని కరోనా నేపథ్యంలో భక్తుల మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/