32వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా రవాణాశాఖ కార్యాలయం ఆనందపురం(మం)గంభీరం దగ్గర రవాణాశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ లకు హాజరైన అభ్యర్థులు,లారీ డ్రైవర్లు,ఆటో డ్రైవర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రాజారత్నం పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యంతాగి వాహనం నడపడం,అతివేగం అలాగే రేష్ డ్రైవింగ్ వంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.రాష్ డ్రైవింగ్ వలన ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుందని ప్రతి ఒక్క వాహనదారులు గుర్తించాలని సూచించారు.అలాగే కారు నడిపే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలిఅని సూచించారు.రహదారి భద్రత నియమాలు పాటిస్తే మన ప్రయాణం సురక్షితంగా సంతోషంగా సాగుతుందని, రహదారి ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాలు మొదటి స్థానంలోనూ..లారీలు రెండవ స్థానంలోనూ,ఆటోలు మూడవ స్థానంలో ఉన్నాయని, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో… ఆర్టివో, ఆర్.టి.ఐ అధికారులు డిపి.రంగారావు,హరిప్రసాద్, బి.రాజారావు,టి. వేణుగోపాలరావు,జి సత్యనారాయణ,పి అమృత కుమారి,కె అప్పన్న,కె రవికుమార్,వి ఐశ్వర్య, ఆనందపురం ఎస్ఐ పి.నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/